ఏడ్చేంత అభిమానం.. !

బాలీవుడ్‌లో అగ్ర కథానాయకుల్లో నవాజుద్దీన్‌ సిద్ధిఖి ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన ఎందరో అభిమానులని సంపాదించుకున్నారు. ఏడ్చేంత అభిమానం సంపాందించుకొన్నారు. నవాజుద్దీన్‌ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఓ అభిమాని ఆయన్ను చూసి ఉద్వేగానికి లోనైంది. ‘తన అభిమాన నటుడిని చూశానన్న సంతోషంతో ఆమె కన్నీరుపెడుతుంటే నవాజ్‌ ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఓదార్చారు’. నవాజ్ తన వీరాభిమానిని ఓదారుస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారింది.

ప్రస్తుతం నవాజ్‌ ‘మాంటో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇండో-పాకిస్థానీ రచయిత అయిన సాద్దత్‌ హాసన్‌ మాంటో జీవితాధారంగా ఈ చిత్రాన్ని నందితా దాస్‌ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు శివసేన అధినేత బాల్‌ఠాక్రే జీవితాధారంగా వస్తున్న ‘ఠాక్రే’ చిత్రంలోనూ నటిస్తున్నారు. బాలా సాహెబ్ పాత్ర‌ను పోషించనున్నాడు. ఈ చిత్రం 2019 జ‌న‌వ‌రి 23న విడుద‌ల చేసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.