వైద్య‌విద్య‌లో రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంలో పిటిష‌న్.

వైద్యవిద్యలో రిజర్వేషన్లకు సంబంధించిన జీవొ నంబ‌రు 550 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశాయి తెలుగు రాష్ట్రాలు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ, కాళోజీ విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు సుప్రీం ను ఆశ్ర‌యించారు. ఆంధ్రా, తెలంగాణ వైద్య విద్యార్థుల త‌ర‌పున న్యాయ‌వాదులు సుప్రీం కోర్టులో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ నెల 23న వాద‌న‌లు వింటామ‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.