రిషి తల్లి ఎవరో తెలుసా ?

‘మహర్షి’లో రిషిగా కనిపించబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ 25వ చిత్రమిది. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే రిషి ప్రయాణం మొదలెట్టాడు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా (ఆగస్టు 9).. రిషి ఫస్ట్ లుక్, ‘మహర్షి’ టీజర్ ని విడుదల చేశారు. రిషి రొమాంటిక్ గా కనిపించాడు. ఐతే, ఇది ఓ యాంగిల్ మాత్రమే. మహేష్ లో మరో రెండు షేడ్స్ చూడబోతున్నారు. స్టూడెంట్ గా, ఓ అమెరికన్ కంపెనీ సీఈవీగా, రైతుగా మహేష్ కనిపించబోతున్నట్టు చెబుతున్నారు.

మహర్షి ఫస్ట్ షెడ్యూల్ డెహ్రీడూన్ లో జరిగింది. అక్కడ మహేష్ పై వచ్చే కాలేజీ సన్నివేశాలని చిత్రీకరించారు. వాటితోనే టీజర్ ని కట్ చేసి వదిలారు. ఆ తర్వాత రెండో షెడ్యూల్ కోసం గోవా వెళ్లింది చిత్రబృందం. ఇప్పుడీ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది.

ఇక, తర్వాత షెడ్యూల్ కోసం మహర్షి చిత్రబృందం యుఎస్ వెళ్లనుంది చిత్రబృందం. అక్కడ మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు కొన్ని చిత్రీకరించనున్నారు. ఐతే, సినిమాలో మహేష్ తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ జయప్రదని తీసుకొన్నారు. దీంతో రిషి తల్లి ఎవరో తెలిసిపోయిందని చెప్పుకొంటున్నారు మహేష్ అభిమానులు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.