బ‌స్తీ మే స‌వాల్..!

బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను,గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ రాజాసింగ్ మంగ‌ళ‌వారం దీక్షకు సిద్ధ‌మ‌య్యారు. గోవులను వధించడానికి పిలిపించిన కసాయిలను గుర్తించి వారిని ఎంక్వైరీ చేయాలని, ప్రభుత్వం త‌న‌ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని హెచ్చ‌రించారు రాజాసింగ్.

గోరక్షా పేరిట తాన కార్యకర్తలు గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే, పోలీసులు అక్రమంగా మంగల్ హాట్ పోలీస్ స్టేషన్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో గో రక్ష్య కార్యకర్తలపై అక్రమ కేసులుపెట్టారని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌శ్నించినందుకు త‌న‌పై కూడా FIR బుక్ చేశారన్నారు రాజాసింగ్. ఇందుకు నిర‌స‌న‌గా బ‌షీర్ బాగ్ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముందు నిరాహార దీక్ష చేస్తున్నాన‌ని, ఒక్కడినే వస్తానంటూ స‌వాల్ విసిరారు. త‌న‌ నిరాహార దీక్ష అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేస్తే ,ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తే ఆ పోలీస్ స్టేషన్లోనే డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కు దీక్ష కొనసాగిస్తాన‌ని తేల్చి చెప్పారు.