అందుకే మెగాస్టార్ రాలేదు

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నర్సింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన 151 సినిమా కోసం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్శింహారెడ్డి జీవిత కథని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు) కానుకగా.. ఒకరోజు ముందుగానే సైరా నర్సింహారెడ్డి టీజర్ ని విడుదల చేశారు. టీజర్ అదిరిపోయింది. ఇప్పుడీ టీజర్ ని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఐతే, టీజర్ లాంచ్ కార్యక్రమానికి మెగాస్టార్ రాకపోవడం కాస్త వెలితిగా అనిపించింది. టీజర్ లాంచ్ కు మెగాస్టార్ ఎందుకు రాలేదని ఓ మీడియా మిత్రుడు రామ్ చరణ్ ని అడిగేశాడు.

దీనికి చరణ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నాన్న బర్త్ డే కానుకగా సైరా టీజర్ ని విడుదల చేశాం. ఆయనకు ఇచ్చే గిఫ్ట్ కి ఆయన వస్తే బాగుండని రాలేదని చెప్పి నవ్వులు పూయించారు. ఇక, నాన్న కోసం ముందు వెనక చూడకుండా ఖర్చు పెడుతున్నాం. లాభ-నష్టాలౌ చూసుకోకుండా.. ఓ అద్భుతమైన సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు రామ్ చరణ్.