కోమ‌టిరెడ్డి, సంప‌త్ కేసులో తెలంగాణ స‌ర్కారుకు ఊర‌ట‌.

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల కేసులో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజ‌న్ బెంచ్ కు అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై 2 నెలల స్టే విధిస్తూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ముఖుల్ రోహిత్ వాదించారు. కేసు విచారణ నడుస్తున్నంత సేపు తీవ్రమైన వాద ప్రతివాదనలు జ‌రిగాయి. ఈ విష‌యంపై కాంగ్రెస్ ఏవిధంగా ముందుకెళుతుందో చూడాలి మ‌రి.