పాటతో.. కేరళకు ధైర్యం చెప్పిన రెహమాన్ !

కేరళ ప్రజల కష్టాలు వర్ణణారహితం. భారీ వర్షాలు, వరదలతో కేరళ కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 80 శాతం కేరళ నీటిలో చిక్కితోంది. ఇప్ప‌టికే 400 మందికి పైగా మ‌ర‌ణించారు. 20వేల కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లింది. విద్యుత్, స‌మాచార వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. 14 ల‌క్ష‌ల మందికి పైగా పున‌రావాస కేంద్రాల‌లో త‌ల‌దాచుకుంటున్నారు.

కేరళ దుస్థితిని చూసి ప్రపంచం చలించిపోతుంది. ఆదుకొనేందుకు దేశ, విదేశాల ప్రజలు ముందుకొస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల సినీ స్టార్స్ కేరళకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇతరులని సాయం చేయమని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. మీమున్నాం.. అంటూ ధైర్ఘ్యం చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ ఓ పాటతో కేరళకు ధైర్ఘ్యం చెప్పారు.

ప్రస్తుతం అమెరికాలో కచేరీలతో రెహమాన్‌ బిజీగా ఉన్నారు. ఇటీవల లాస్‌ఏంజెల్స్‌లో కచేరీలో పాల్గొన్న రెహమాన్‌..కేరళ వాసులకు ధైర్యం చెబుతూ ఈ పాటను వారికి అంకితం చేశారు. ప్రేమదేశం’ చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా’ పాటను పేరడీగా చేసి ‘కేరళ..కేరళ..డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ పాటను ఆలపించారు. ఆ పాటని మీరు వినేయండీ.. !