ఇంగ్లండ్’పై భారత్ భారీ విజయం

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్’లో వరుసగా రెండు టెస్టులని ఓడి విమర్శలపాలైన కోహ్లీ సేన.. మూడో టెస్టులో సత్తా చాటింది. ఆతిథ్య జట్టుని 203 పరుగుల తేడాతో ఓడించింది. టెస్టు ఆరంభం నుంచి టీమిండియాదే పైచేయిగా సాగింది. ఏ దశలోనూ ఈ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించేదిగా అనిపించలేదు. అంత కసిగా ఆడింది కోహ్లీ సేన. తద్వారా తమపై వస్తున్న విమర్శలకు తగిన సమాధానం ఇచ్చినట్టయ్యింది.

ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 329 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ని 161పరుగులకు అలౌట్ చేసింది. హార్థిక ప్యాండ్యా కేవలం 6ఓవర్లలో 5వికెట్లు తీసుకొన్నారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో భారత్ 357/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 521పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద అలౌట్ అయ్యింది. దీంతో 203 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించినట్టయ్యింది.