బ‌స్తీ మే స‌వాల్: సెప్టెంబ‌ర్2నే ‘ప్ర‌గ‌తి నివేద‌న’ స‌భ‌..!

దేవుడు దిగి వచ్చిన సెప్టెంబర్ 2న కేసీఆర్ సభ నిర్వహించలేరని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారో లేక అనుకున్న ప్ర‌కారం స‌భ జ‌రిపి తీరాల‌ని ప్ర‌భుత్వం భావించిందో తెలియ‌దుగానీ… సీఎం కేసీఆర్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టుగానే సెప్టెంబ‌ర్2న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సెప్టెంబర్ 2 న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 25 లక్షల మంది హాజరయ్యే ఈ సభ కోసం గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. దాదాపు 1600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశామని, అందులో సభావేదిక, బారికేడ్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.