టీవీ9 అమ్ముడు పోయిందా ?

టీవీ 9 న్యూస్ ఛానల్ అమ్ముడుపోయినట్టు సమాచారమ్. టీవీ9 వ్యవస్థాపకుడు చింతలపూడి శ్రీనివాసరాజు (శ్రీని రాజు) కొన్నాళ్లుగా ఈ సంస్థను అమ్మేందుకు యత్నిస్తున్నారు. తాజాగా, సుమారు రూ. 500 కోట్లకు డీల్ సెటిల్ అయినట్టు సమాచారం. ఎంఈఐఎల్, హైహోమ్ గ్రూప్ లు సంయుక్తంగా టీవీ9 ఛానల్ ని కొనేసినట్టు చెప్పుకొంటున్నారు. ఎంఈఐఎల్ పీవీ కృష్ణారెడ్డికి చెందినది కాగా… మైహోమ్ గ్రూపు జూపల్లి రామేశ్వర్ రావు కు చెందినది. ఐతే, ఈ అమ్మకంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార సమాచారమ్ రాలేదు.