ప‌వ‌న్ కంటికి ఆప‌రేష‌న్..!!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటికి ఆప‌రేష‌న్ జ‌రిగింది. పొలిటిక‌ల్ గా పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టి యాత్ర‌ల‌తో బిజీ బిజీగా ఉన్న ప‌వన్.. గ‌త కొంత‌కాలంగా కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో గురువారం ఆయ‌న కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని సెంట‌ర్ ఫ‌ర్ సైట్ ఆసుప‌త్రిలో ఆయ‌నకు కంటి ఆప‌రేష‌న్ జ‌రిగింది. నేత్ర‌వైద్య నిపుణులు డాక్ట‌ర్ సంతోష్ జి.హోనావ‌ర్ ప‌వ‌న్ కు ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు.

గ‌త నాలుగు నెల‌లుగా కంటి స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న ప‌వ‌న్ కు నెల‌రోజుల క్రితం ఒక సారి కంటి ఆప‌రేష‌న్ జ‌రిగింది. అయితే స‌రైన విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో ఆయ‌న కంటికి ఇన్ ఫెక్ష‌న్ అయింది. దీంతో వైద్యులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌రోసారి కంటి ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. పూర్తిస్థాయిలో త‌గ్గే వ‌ర‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు ప‌వ‌న్ కు సూచించారు.