కవితని కలిసిన గోవిందుడు


గీత గోవిందం ల ప్రేమకథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. ఈ వినోదాత్మక ప్రేమకథపై మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని.. చాలా మంది ప్రశంసలు గుప్పించారు. ఈ లిస్టులో ఎంపీ కవిత కూడా ఉన్నారు. ఇటీవల ‘గీత గోవిందం’ సినిమా చూసిన కవిత.. చాలా బాగుందంటూ కితాబిచ్చారు. చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

తాజాగా, గీత గోవిందం చిత్రబృందం ఎంపీ కవితని కలిశారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్, నిర్మాత బన్నీవాసు కవితని కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక, గతంలో అర్జున్ రెడ్డి సినిమాని చూసిన మంత్రి కేటీఆర్ చిత్రబృందాన్ని అభినందించిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి కుటుంబంతో విజయ్ దేవరకొండకు ప్రత్యేక అనుబంధం ఉంది. వీరి బంధువులు అని కూడా తెలిసింది. ఓ సారి మంత్రి కేటీఆర్ విజయ్ ఇంటికి కూడా వెళ్లారు. ఇక, అర్జున్ రెడ్డి సినిమాకు గానూ తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డుని వేలం వేసి.. రైతుల కోసం ముఖ్యమంత్రి సహాయనిదికి విరాళంగా ఇచ్చాడు విజయ్.