అంద‌రినీ క‌లుపుకుపోవ‌డం అంటే ఇదేనా..?

2014కు ముందు టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో పెట్టిన విష‌యాల‌పై ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో మాట్లాడాల‌ని టీడీపీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక మొద‌టి ప్ర‌సంగంలో అంద‌రినీ క‌లుపుకుని తెలంగాణ‌కు అభివృద్ధి చేస్తామ‌ని అన్నార‌ని ఆయ‌న తెలిపారు. కానీ కేసీఆర్ కలుపుకుని పోవ‌డం అంటే అన్ని పార్టీల నేత‌ల‌ను త‌న పార్టీలో క‌లుపుకోవ‌డం అనుకోలేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ప్ర‌గతి నివేద‌న స‌భ‌లో వివ‌ర‌ణ ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్ ది ప్ర‌గ‌తి శూన్య స‌భ అని, ఇక నుంచి తాము కేసీఆర్ విస్మ‌రించిన ప్ర‌తీ అంశంపై ప్ర‌జా నివేదిక‌ను ఇస్తామ‌ని ఆయ‌న చెప్పారు.