కేసీఆర్ ‘ముంద‌స్తు’ ముచ్చ‌ట‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముంద‌స్తుకు సిద్ధంకండంటూ టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశంలోపార్టీనేత‌ల‌కు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భలో భేరీ మోగిద్దామ‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ స‌భ‌కు 25ల‌క్ష‌ల మంది హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేశారు కేసీఆర్. ఎన్నిక‌లు ఎప్పుడైనా జ‌ర‌గొచ్చ‌ని, పార్టీ నేత‌లంతా ఇందుకు సిద్ధం కావాల‌ని చెప్పారు సీఎం.

ఇప్పటికే తెలంగాణలో ముంద‌స్తు వేడి రాజుకున్న నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త‌నివ్వ‌డంతో రాజ‌కీయం మ‌రింత వేడెక్కనుంది. ప‌రిస్థితుల‌ను ముందే ఊహించిన విపక్షాలు ఎన్నిక‌ల యుద్దానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.