హ‌స్తిన‌లో సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.ముంద‌స్తు సంకేతాల నేప‌థ్యంలో సీఎం ఢిల్లీ ప‌ర్య‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్ర‌ధానితో భేటీ ముగిసిన త‌రువాత పలువురు కేంద్రమంత్రులను ఆయన కలుస్తారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులకు సీఎం కేసీఆర్ వివ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.