బీజేపీ ఎంపీ కారు బీభ‌త్సం…

ఏపీ బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు కారు బీభ‌త్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న జీవీఎల్ కారుఅదుపుత‌ప్పి రోడ్డుపై కాలిన‌డ‌క‌న వెళుతున్న మ‌హిళ‌ల‌పైకి దూసుకెళ్లింది. గుంటూరు జిల్లా తాడేప‌ట్ట్ఇ మండ‌లం కొల‌నుకొండ‌లో జ‌రిగిన ఈ యాక్సిడెంట్ లో ఓ మ‌హిళ అక్క‌డిక్క‌డే మృతిచెందింది. మ‌రో మ‌హిళ‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

ప్రమాదం తర్వాత జీవిఎల్ సంఘటన స్థలం నుంచి మరో కారులో వెళ్లిపోయారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితురాలికి కనీసం ఎక్స్ గ్రేషియా ప్రకటించకుండా గాయపడిన మహిళను పరామర్శించకుండా వెళ్లిన ఎంపీ జీవిఎల్ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మాన‌వాతా దృక్ప‌థంతో కూడా వారికి ఎంపీ సాయం చేయ‌క‌పోవ‌డంపై విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

దీంతో తాను సంఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో నిద్రిస్తున్నాన‌ని, పోలీసులు వ‌చ్చే వ‌ర‌కు దాదాపు 45 నిమిషాలు అక్క‌డే ఉన్నాన‌ని, గాయప‌డిన మ‌హిళ‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లార‌ని, బాధిత కుటుంబాల‌ను తాను విజిట్ చేస్తాన‌ని,వారికి అన్నివిధాలా అండ‌గా ఉంటాన‌ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు జీవీఎల్.