‘సైకిల్’ పై స‌వారీ వ‌ద్దంటున్న రాముల‌మ్మ‌!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉండ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ మ‌హిళా నేత విజ‌య‌శాంతి మాత్రం దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. టీడీపీతో పొత్తుతో న‌ష్టం తప్ప‌ద‌ని ఆమె భావిస్తున్నారు. అంతేకాదు ఈ అంశంపై రాహుల్ కు లేఖ రాయాల‌ని కూడా రాముల‌మ్మ ఉన్నార‌ట‌. మెద‌క్ జిల్లా కాంగ్రెస్ నేత‌ల వ‌ద్ద ఆమె త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం కొంద‌రు నేత‌లు కాంగ్రెస్ అధిష్టానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని విజ‌య‌శాంతి చెప్పార‌ట‌. టీడీపీ పొత్తుతో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ , నిజామాబాద్ జిల్లాల్లో న‌ష్టం త‌ప్ప‌ద‌ని, హైద‌రాబాద్ ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొంద‌రుకాంగ్రెస్ నేత‌లు టీడీపీతో పొత్తుకోసం ఉబ‌లాట‌ప‌డ‌టం సంమంజ‌సం కాద‌ని ఆమె అన్నార‌ట‌.