హిట్ సెంటిమెంట్’తో ‘నర్తనశాల’.. !

సినిమా అన్నాక టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడం మస్ట్. అవి ప్రేక్షకుడుకి థియేటర్ కు రప్పిస్తాయి. ఐతే, ఈ మధ్య టీజర్ తోనే సరిపెడుతున్నారు. ట్రైలర్ లేకుండానే సినిమాని థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన మహానటి, గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇప్పుడీ సెంటిమెంట్ ని ‘నర్తనశాల’ చిత్రబృందం ఫాలో అవుతోంది.

శుక్రవారం ‘నర్తనశాల’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ లో ట్రైలర్ విడుదల చేస్తారని అందరు అనుకున్నారు. కానీ, ట్రైలర్ విడుదల చేయకుండా.. జస్ట్ వాచ్ ఫుల్ మూవీ ఇన్ థియేటర్స్ అంటూ స్లయిడ్ వేసి -సర్ప్రయిజ్ ఇచ్చారు. దీంతో నర్తనశాల చిత్రబృందం హిట్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్టు కనబడుతోంది.

‘ఛలో’ తర్వాత నాగశౌర్య సొంత బ్యానర్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. వంశీ పైడి పల్లి దగ్గర శిష్యుడిగా పనిచేసిన చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. నాగశౌర్య సరసన యామిని, కాశ్మీరా జతకట్టనున్నారు.