చెన్నైలో హృతిక్ పై కేసు నమోదు

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పై చెన్నైలో కేసు నమోదు అయింది. పెర్ ప్యూమ్ కంపెనీని మోసం చేసిన కేసులో హృతిక్ రోషన్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. హృతిక్ కి కోర్టు కేసులు కొత్తేమీ కాదు. హృతిక్ భార్య సుసానే తో కోర్టు నుంచి విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇక, హృతిక్ రోషన్, బాలీవుడ్ హీరోయిన్ కంగనా ఏపీసోడ్ చాన్నాళ్లే నడిచింది. వీరి వివాదానికి కోర్టు కూడా పరిష్కారం చూపలేకపోయింది. ఐతే, కొద్దిరోజుల గ్యాప్ తర్వాత హృతిక్ పై మళ్లీ కేసు నమోదవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.