రాఘవేంద్ర రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆయన వాహన శ్రేణిలోని స్కార్పియో అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆ సమయంలో రాఘవేంద్ర రావు వాహనం లేరు. ఆ వెనకే వస్తున్న మరో వాహనంలో ఆయన ఉన్నట్టు సమాచారమ్.

టాలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అదించిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన మునిపటిలా వరుసగా సినిమాలు చేయడం మానేసి చాన్నాళ్లయ్యింది. అప్పుడప్పుడు భక్తిరసచిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన చేసిన ఆఖరి చిత్రం ‘నమో వెంకటేశాయ’. ఈ సినిమాలో నాగార్జునని శ్రీవారి భక్తుడు హతిరామ్ బాబాగా చూపించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొన్నా… కమర్షియల్ గా ఆడలేదు. ప్రస్తుతం రాఘవేంద్రరావు టీటీడీ భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.