‘నర్తనశాల’ కోసం నాగశౌర్య పూజలు


‘ఛలో’ సినిమాతో తొలిసారి పెద్ద విజయాన్ని అందుకొన్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఛలో’ సూపర్ హిట్ తర్వాత నాగశౌర్య నటిస్తున్న చిత్రం “నర్తనశాల”. సిమ్రాన్‌ పరీన్జా హీరోయిన్. దర్శకుడు వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగారిచయం కానున్నారు. ఈ నెల 30న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తాజాగా, నాగశౌర్య కడపలోని విజయదుర్గా దేవి ఆలయాన్ని, పెద్దదర్గాను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. నర్తనశాల తర్వాత తాను నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో టైటిల్ ని ప్రకటిస్తామని తెలిపొఆరు. కడప ప్రజల ప్రేమాభిమానులు మరువలేనివని కొనియాడారు.