తమన్నాతో పార్టీ చేసుకొన్న సమంత

పింకీ రెడ్డి ఇచ్చిన పార్టీలో హీరోయిన్లు సమంత, తమన్నా, అదితిరావు హైదరి సందడి చేశారు. ఈ పార్టీలో అక్కినేని అమల కూడా పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను సమంత, తమన్నాలు తమ ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

‘పింకి రెడ్డి చక్కటి విందు ఏర్పాటు చేశారు. ‘రా మ్యాంగో’ పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత అమల మేడమ్, సమంత, అదితి లను కలవడం తనకు సంతోషంగా ఉంది’ అని తమ్మూ ట్విట్ చేసింది.

సమంత నటించిన ‘యు టర్న్’ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున ఆమె నటించిన తమిళ చిత్రం ‘సీమరాజా’ విడుదల కానుంది. ఇక, తమన్నా తెలుగు ‘క్వీన్’తో పాటు వెంకీ-వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్2’లో నటిస్తోంది. అదితి రావు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమాలో నటిస్తోంది.