అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు.

సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు గురువారం జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.