నందమూరి కుటుంబానికి న‌ల్ల‌గొండ సెంటిమెంట్..!

నంద‌మూరి కుటుంబంలో ఒక్కొక్క‌రికి జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల‌ను గ‌మ‌నిస్తే ఓ సెంటిమెంట్ నంద‌మూరి అభిమ‌మానుల్లో బ‌లంగా నాటుకుపోయింది. ఇప్పుడు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన హ‌రికృష్ణతో పాటు గ‌తంలోనూ జ‌రిగిన ప్ర‌మాదాల‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే న‌ల్ల‌గొండ జిల్లా నంద‌మూరి కుటుంబానికి క‌లిసిరావ‌డంలేద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. నంద‌మూరి కుటుంబంలో జ‌రిగిన వ‌రుస ప్ర‌మాదాల‌న గ‌మ‌నిస్తే ప్ర‌తీ నాలుగైదేళ్లకోసారి న‌ల్గొండ జిల్లాలోనే జ‌రుగుతున్నట్లుగా అర్థ‌మ‌వుతోంది.

2009లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లి వ‌స్తూ జూనియ‌ర్ ఎన్న‌టీఆర్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. అదృష్ట‌వ‌శాత్తూ ఎన్టీఆర్ ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌తో ప్రాణాలు ద‌క్కించుకున్నారు. మ‌ళ్లీ 2014లో డిసెంబ‌ర్ 6న హ‌రికృష్ణ పెద్ద కుమారుడు జాన‌కీరామ్ కారు ప్ర‌మాదానికి గురైంది. ఇంచుమించు ఎన్టీఆర్ కు ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌లోనే జాన‌కీరాం కు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌మాదంలో జాన‌కీ రాం మృతి చెందిన విష‌యం తెలిసిందే.

మ‌ళ్లీ నాలుగు సంవ‌త్స‌రాల త‌రువాత ఇప్పుడు హ‌రికృష్ణ కూడా న‌ల్గొండ‌జిల్లాలోని అన్నెప‌ర్తి ద‌గ్గ‌ర జ‌రిగిన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం నంద‌మూరి కుటుంబానికి న‌ల్ల‌గొండ జిల్లా క‌లిసిరావ‌డంలేద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు. ఆ కుటుంబానికి ఇదొక సెంటిమెంట్ గా మారింద‌ని చెప్పుకుంటున్నారు..