హరికృష్ణ అంతిమయాత్ర : నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

నల్గొండ జిల్లా అద్దంకి – నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిలో అన్నెపర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీనటుడు, మాజీ మంత్రి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మాసబ్‌ట్యాంక్‌ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో రావొద్దని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. బజార్‌ఘాట్‌, ఆసిఫ్‌నగర్‌ మీదుగా వెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి వచ్చే వారు ఫిల్మ్‌నగర్‌ మీదుగా వెళ్లాలని సూచించారు.