పరశురామ్ దేవుడ్ని పట్టుకొన్నాడట

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దేవుడిని పట్టుకొన్నాడట. ఆయన తదుపరి సినిమా దేవుడికీ, మనిషికీ మధ్య జరిగే కథాంశంతో తెరకెక్కనుందని సమాచారమ్. ఇంకా పూర్తి స్క్రిప్టు రెడీ కాలేదు. ఇది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కనుంది. హీరో ఎవరన్నది కూడా ఇంకా అనుకోలేదట.

భగవంతుడు భక్తుడుకి గల అనుసంధానంతో చాలా సినిమాలే వచ్చాయ్. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ‘పీకే’, తెలుగులో వెంకీ-పవన్ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు పరశురామ్ దేవుడిని ఏవిధంగా కార్నర్ చేయబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.

దేవుడిని టచ్ చేయడం సాహసమే. ఆయన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే భక్తి సంఘాలు మీద పడిపోవడం ఖాయం. మరీ.. పరశురామ్ దేవుడిని ఎలా డీల్ చేస్తాడన్నది చూడాలి. బహుశా.. దేవుడుతోనూ వినోదాన్ని పడిస్తాడేమో. ‘గీత గోవిందం’ లాంటి సింపుల్ ప్రేమకథని వినోదాత్మకంగా చూపించి ప్రశంసలు అందుకొంటున్నాడు పరశురామ్. ఈ సినిమా ఇప్పటికే రూ. 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది.