టీఆర్ఎస్ ‘ప్ర‌గ‌తి నివేద‌న స‌భ’ను ఆపాలి…!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 న నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ దాఖ‌లైంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు, న్యాయ‌వాది అయిన పూజారి శ్రీ‌ద‌ర్ వేసిన ఈ పిటిష‌న్ ను శుక్ర‌వారం హైకోర్టు విచారించ‌నుంది. ప్ర‌భుత్వం త‌న నివేదిక‌ను ప్ర‌క‌టించాల‌నుకుంటే టెక్నాల‌జీ ద్వారా సాంఘీక మాధ్య‌మాల ద్వారా చేయాల‌ని, అంతేగాని ఇలా స‌భలు పెట్టి ప్ర‌జ‌ల‌ను, ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఇబ్బందులు క‌ల‌గ‌జేయ‌కుండా చూడాల‌ని పిటిష‌న‌ర్ త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు.