‘అరవింద సమేత’లో బాలయ్య గెస్ట్ రోల్ !

కళ్యాణ్ రామ్, తారక్ లు బాబాయ్ బాలయ్యకు దగ్గరైనట్టు తెలుస్తోంది. హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అంత్యక్రియల తర్వాత జరగాల్సిన కార్యక్రమాలని దగ్గరుండి కళ్యాణ్, తారక్ లతో చేయించారట. వీరిద్దరితో బాలయ్య ఆప్యాయంగా మాట్లాడుతూ.. కలసి భోజనం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక, తండ్రిపోయాడనే బాధ నుంచి బయటపడేందుకు తారక్, కళ్యాణ్ లు ఇద్దరు తమ తమ సినిమా షూటింగ్ లో శనివారం నుంచి జాయిన్ అయ్యారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తారక్ ‘అరవింద సమేత’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ‘అరవింద సమేత’ కోసం బాలయ్య గెస్ట్ గా మారబోతున్నట్టు సమాచారమ్. సినిమాలో కాదు. ఈ సినిమా ఆడియో వేడుకకు బాలయ్యని ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు చెబుతున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఫ్యాక్షన్, యాక్షన్ తారక్ కు కొట్టిన పిండి. దాన్ని తాత ఎన్ టీఆర్, బాబాయ్ బాలయ్య నుంచి అబ్బిందని చెబుతుంటారు.అలాంటి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అరవింద సమేత కోసం బాలయ్య గెస్ట్ అంటే అదిరిపోదు.

ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో టీజర్ తోనే చెప్పేశాదు. ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. మరో హీరోయిన్ గా ఈషా దెబ్బ నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాథాకృష్ణ నిర్మాత. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.