తెలంగాణ‌లో ప‌వ‌న్ దారెటు..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీలో ఉంటుంద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలో క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌ని స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ ప‌వ‌న్ ఆదిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌వ‌న్ తో క‌ల‌వ‌డానికి సిద్ధ‌మ‌ని సీపీఎం లేఖ‌లో స్ప‌ష్టం చేసింది.

తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ద‌మ‌ని గ‌త కొద్దిరోజుల క్రితం సీపీఎం కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం లేఖ‌రాశారు. అయితే లేఖ‌పై ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆదివారం జ‌న‌సేన పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీతో సీపీఎం తెలంగాణ నేత‌లు స‌మావేశ‌మ‌వుతున్నారు. మ‌ధ్యాహ్నం జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌రిగే స‌మావేశంలో తెలంగాణ‌లో సీపీఎంతో క‌లిసి ప‌నిచేసే అంశంపై చ‌ర్చించ‌నున్నారు. ఒక‌వేళ తెలంగాణ‌లో జ‌న‌సేన సీపీఎంతో పొత్తుకు ఓకే అయితే తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ప‌వ‌న్ అడుగులు ఎటువైపో చూడాలి.