మహేష్ తో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి సినిమా.. ఫిక్స్ !

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సందీప్ చెప్పిన కథని మహేష్ ఓకే చేశాడు. ‘చక్కెర ఫ్యాక్టరీ’ టైటిల్ అనుకొంటున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. సందీప్ సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమా ‘మహర్షి’తో బిజీగా ఉన్నారు. వంశీపైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్.

ఇక, సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26వ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ సినిమా స్కిప్టుని పూర్తి చేసే పనిలో సుకుమార్ ఉన్నారు. ‘వన్ – నేనొక్కడినే’తో మహేష్, ఆయన అభిమానులని నిరాశపరిచిన సుకుమార్.. ఈ సారి మాత్రం తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితో ఉన్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ యేడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ 27వ సినిమా సందీప్ వంగా దర్శకత్వంలో ఉండనుంది.

ప్రస్తుతం సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రిమేక్ తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ అర్జున్ రెడ్డిగా షాహిద్ కపూర్ కనిపించబోతున్నారు. టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో ఏ మేరకు రాణిస్తాడు అన్నది ఆసక్తిగా మారింది.