క్రిష్’కు ఘోర అవమానం.. !

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ కు బాలీవుడ్ లో ఘోర అవమానం జరిగినట్టు సమాచారమ్. ఆయన దర్శకత్వంలో కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన భాగానికి కంగనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే క్లాప్ బోర్డుపై దర్శకుడు స్థానంలో కంగనా పేరు కూడా కనిపించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా.. క్రిష్ స్థానంలో కంగనా ఏంటీ ? అనే ప్రశ్నలు వెలువెత్తాయి. దీనికి చిత్రబృందం సమాధానం కూడా ఇచ్చింది.

‘మణికర్ణిక’ చిత్రానికి దర్శకుడు క్రిష్ నే. ఆయన ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో బిజీగా ఉండటం కారణంగా.. ప్యాచ్ వర్క్ కు కంగనా దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో యూనిట్ సభ్యుల్లో ఎలాంటి కన్పూజన్ ఉండకుండా ఉండేందుకు క్లాప్ బోర్డుపై కంగనా పేరుని రాశాం. క్రిష్ సూచనలతోనే షూటింగ్ జరుగుతోంది. ఆయన తనతో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారని కంగనా క్లారిటీ ఇచ్చింది. అయినా… మణికర్ణక నుంచి క్రిష్ తప్పుకొన్నాడనే ప్రచారనికి పులిస్టాప్ పడటం లేదు.

ఇటీవల కంగనాపై నటుడు సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు దారితీస్తున్నాయి. ‘మణికర్ణిక’ నుంచి సోనూసూద్ మధ్యలోనే తప్పుకొన్నారు. కంగనాని భరించలేకనే ఆయన సినిమా నుంచి తప్పుకొన్నారంట. కంగనాకు దర్శకత్వం వహించే అర్హత ఏమి ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోనూసూద్ వ్యాఖ్యలని బట్టి మర్ణికర్ణికకు కంగనానే దర్శకత్వం వహించారు. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకొన్నాడని చెప్పుకొంటున్నారు. అదికూడా క్రిష్ ని అవమానించి ఈ సినిమా నుంచి తప్పుకొనేలా చేశారని బాలీవుడ్ సమాచారమ్. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది క్రిష్ క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో.. !