బిగ్ బాస్ హౌస్’లో సామాన్యులకు చోటు లేదు


బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకి చోటు లేదు. ఈవారం ఇద్దరు కామెన్ మెన్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. శనివారం గణేష్, ఆదివారం నూతన్ నాయుడు ఇంటి నుంచి బయటికొచ్చారు. బిగ్ బాస్ 2 కోసం ముగ్గురు సామాన్యులని తీసుకొన్నారు. గణేష్, సంజన అన్నె, నూతన్ నాయుడులు కామన్ మెన్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐతే, తొలివారమే సంజన ఇంటి నుంచి బయటికి పంపించడం, ఆ కొద్దిరోజులకే నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ షో పై తీవ్రవిమర్శలొచ్చాయ్. బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకు చోటు లేదనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విమర్శల నేపథ్యంలో బిగ్ బాస్ జాగ్రత్తపడ్డాడు. మిగిలిన కామెన్ మెన్ గణేష్ ని ఎలిమినేట్ చేసే ధైర్ఘ్యం చేయలేదు.

పైగా ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడుని మళ్లీ తీసుకొచ్చి.. తనపై పడిన ముద్రని చెరిపేసుకొనే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. ఐతే, ఇద్దరు కామన్ మెన్స్ ని ఒకే వారం ఇంటి నుంచి బయటికు పంపడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బయటి నుంచి వస్తున్న విమర్శల కారణంగానే కామన్ మెన్స్ ని ఇన్నాళ్లు ఇంటిలో ఉంచారు. లేదంటే ఎప్పుడో బయటికి పంపేవారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఆదివారం షో ఫన్నీగా సాగింది. ఇద్దరు ఇంటి సభ్యులతో ఒకరికి కళ్లకి గంతలు కట్టి మరొకరికి మేకప్ వేయించే గేమ్ ని ఆడిపించాడు నాని. ఇక, పోతు.. పోతు నూతన్ నాయుడు తనకు లభించిన బిగ్ బాంబుని స్నేహితుడు కౌశల్ పై విసిరాడు. ఈ వారం మొత్తం ఇంటి సభ్యులు తినేసిన ప్లేట్స్ ని కౌశల్ కడగాల్సి ఉంటుంది.