జంట పేలుళ్ల దోషులెవ‌రో తేల్చిన నాపంల్లి ప్ర‌త్యేక కోర్టు.

గ‌త కొన్నేళ్ల క్రితం జ‌రిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్కు లో జ‌రిగిన జంట పేలుళ్ల కేసుకు సంబంధించి నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దాదాపు 11ఏళ్లుగా సాగిన ఈ కేసు విచార‌ణ ఇప్ప‌టికి ఓ కొలిక్కి వ‌చ్చింది.ఈ కేసులో అనిక్ స‌ఫిక్ స‌య్య‌ద్ , అక్బ‌ర్ ఇస్మాయిల్ చౌద‌రి అనే ఇద్ద‌రిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఐదుగురిలో మిగ‌తా ముగ్గురిని నిర్దోషులుగా ప్ర‌కటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దోషుల‌కు సోమ‌వారం నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది.