సల్మాన్’తో వెంకీ మల్టీస్టారర్ !

విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా రావడం దాదాపు మానేశాడు. ‘గురు’ తర్వాత ఆయన వరుసగా మల్టీస్టారర్ సినిమాలే ప్లాన్ చేసుకొంటున్నారు. ప్రస్తుతం ఆయన రెండు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’లో నటిస్తున్నారు వెంకీ. ఈ చిత్రానికి అనిల్ రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, బాబీ దర్శకత్వంలో వెంకీ-చైతూ మల్టీస్టారర్ గా ‘వెంకీ మామ’ తెరకెక్కుతోంది. ఈ రెండు సెట్స్ మీదుండగానే మరో రెండు మల్టీస్టారర్స్ కి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారమ్. తమిళ్ స్టార్ సూర్యతో కలిసి వెంకీ ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగానే వెంకీ నటించబోయే మరో మల్టీస్టారర్ సినిమా న్యూస్ బయటికొచ్చింది. మణిరత్నం ‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానటి’లో జెమిని గణేశన్‌గా నటించి ఆకట్టుకొన్నారు. ఇప్పుడీ యంగ్ హీరో వెంకీతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడట. ఇదో వార్‌ డ్రామాగా తెరకెక్కించనున్నచిత్రమని చెబుతున్నారు. ఇప్పటికే వెంకీ, దుల్కర్ కథని ఓకే చేశారు. త్వరలో అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.