మంత్రుల‌కు కేసీఆర్ ఫోన్.. 2.30కు సీఎం మీడియా స‌మావేశం..?

అసెంబ్లీ ర‌ద్దు వార్త‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగామారుతున్నాయి. మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌క‌ల్లా మంత్రులంతా ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు చేరుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ స్వ‌యంగా మంత్రుల‌కు ఫోన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల‌కు కూడా సీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా ఒంటిగంట‌లోగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో ఉండాల‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ నిర్వ‌హించి అనంత‌రం 2.30కి ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ ర‌ద్దు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టిక్కెట్లు రాని ఎమ్మెల్యేలను బుజ్జ‌గించే ప‌నిని కేటీఆర్ కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. రాజ్ భ‌వన్ లో గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ ను కూడ కోరిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మ‌రి కొద్ది గంట‌ల్లో అసెంబ్లీ ర‌ద్దుపై ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుంది.