ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరే… ఎంఐఎం మాకు మిత్ర‌ప‌క్షం..

ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోబోమ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతిక‌మ‌ని ఆయ‌న అన్నారు. త‌మ‌కు ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాల్సిన ప‌నిలేద‌ని, ఎన్నిక‌ల్లో 100సీట్లు గెలిచి తీరుతామ‌ని ఆయ‌న చెప్పారు. ఎంఐఎం కేవ‌లం ఫ్రెండ్లీ పార్టీ అని, వారు త‌మ‌కు మ‌ద్ద‌తు తెలుపుతార‌ని ఆయ‌న చెప్పారు. గ‌తంలో త‌మ‌ను ఇబ్బంది పెట్టిన స‌మ‌యంలో అస‌దుద్దీన్ ఓవైసీ త‌మ‌కు అండ‌గా నిలిచార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆ మిత్ర‌త్వం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. నాలుగు రాష్ట్రాల‌తో పాటే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, న‌వ‌బంరులో ఎన్నిక‌లు జ‌రిగి డిసెంబ‌ర్ లో ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు కేసీఆర్.