రైలు బోగీలో 65ల‌క్ష‌లు…!!

నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ ట్రైన్ బోగిలో డబ్బులు బ‌య‌ట‌ప‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది. పోలీసుల సోదాలో 65 లక్షల నగదు బ‌య‌ట‌ప‌డింది. వీటిలో అన్ని రెండు వందలు, రెండు వేల రూపాయల నోట్లే. హవాల మార్గంలో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కంటైనర్ లో చెప్పలు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాకింగ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గత కొంత కాలం గా డబ్బును అక్రమార్గాల్లో తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. నోట్ల కట్టలపై ఉన్న బ్యాంకు లెబుల్స్ ద్వారా ..ఏ బ్యాంకు నుండి డ్రా చేశారో గుర్తించ‌నున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.