పూజా ఒకేసారి ముగ్గురితో.. !

టాలీవుడ్’లో ముద్దుగుమ్మ పూజా హెగ్డే హవా మాములుగా లేదు. ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ సినిమా తర్వాత ఆమె జాతకం పూర్తిగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సెట్స్ మీదున్న రెండు క్రేజీ సినిమాల్లోనూ పూజానే హీరోయిన్. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్’కు జోడీగా, ‘మహర్షి’ మహేష్ తోనూ రొమాన్స్ చేస్తోంది. వీరిద్దరు సరిపోవట్లేదు అన్నట్టు.. ప్రభాస్ ని లైన్ లో పెట్టేసింది. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్.. తన తదిపరి సినిమాని ‘జిల్’ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. గురువారం ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకొంది.

ఇదో ప్రేమకథా చిత్రం. 1960 -70 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ పూజా హెగ్డేని తీసుకొన్నారు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజుతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఈ నెల 20 నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషన్ స్టార్ అయ్యాడు. ఆయన తదుపరి సినిమాలని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేసుకుంటుండం విశేషం. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతోన్న ‘సాహో’ వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.