మహేష్ సినిమా కోసం రూ.150 కోట్ల బడ్జెట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రూ. 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. కాలేజీ స్టూడెంట్, ఓ అమెరికన్ కంపెనీ సీఈవో, రైతు పాత్రల్లో అలరిస్తాడట. పూజా హెగ్డే హీరోయిన్. కామెడీ హీరో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 5న ‘మహర్షి’ విడుదల కానున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26వ చిత్రం తెరకెక్కనుంది.

ఇప్పటికే కథ ఓకే అయ్యింది. స్క్రిప్టు పనులు కూడా పూర్తికావొస్తున్నాయి. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ సినిమా కోసం మైత్రీ మూవీస్ రూ. 150కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయనుందట. గతంలో సుకుమార్ – మహేశ్ కలయికలో వచ్చిన ‘వన్-నేనొక్కడినే’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినా.. తనని మరోసారి నమ్మిన మహేష్ కు ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే కసితో సుకుమార్ ఉన్నారు. ఆ కారణంగానే భారీ బడ్జెట్ తో సినిమాని రిచ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఇక, మహేష్ 27 కూడా ఫిక్సయిందని తెలిసింది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగాతో మహేష్ 27 ఉండనుంది.