ఇది కేసీఆర్ సృష్టించిన రాజ‌కీయ గంద‌ర‌గోళం..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దు చేస్తార‌ని , ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో టీజేఎస్ అధ్య‌క్షులు కోదండ‌రాం ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. ఉద‌య‌మే కేబినెట్ అన్నారు, మ‌రోసారి మ‌ధ్యాహ్నం కేబినెట్ అని, అసెంబ్లీ ర‌ద్దు అంటూ రాజ‌కీయ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని, ఆయ‌న ఏం చేస్తారనేది , ముఖ్య‌మంత్రి ఆలోచ‌న ఏమిటో స్ప‌ష్ట‌త లేద‌ని ఆయ‌న అన్నారు. ఒక స్ప‌ష్ట‌త లేకుండా అందరినీ గంద‌ర‌గోళంలో ప‌డేసి, రాజ‌కీయ వేడి ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జా సంక్షేమానికి సంబంధించి ఏం చేయాలో నిర్ణ‌యాలు తీసుకోకుండా త‌న స్వార్థం కోసం ఒక రాజ‌కీయ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని ఆయన అన్నారు.