స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఢిల్లీకి ఉత్త‌మ్.

ముంద‌స్తు ఎన్నిక‌ల వార్తల నేప‌థ్యంలో విప‌క్ష కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. తెలంగాణ‌లో వేగంగా మారుతున్న రాజకీయ ప‌రిణామాల దృష్ట్యా అసెంబ్లీ ర‌ద్దు జ‌రిగితే ఏం చేయాల‌నేదానిపై ఇప్ప‌టికే నేత‌లంతా స‌మావేశ‌మై చ‌ర్చించుకున్నారు. మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసుకుని ప్ర‌క‌టించారు. అయితే కాంగ్రెస్ కొన్ని కీల‌క ప‌ద‌వుల‌కు సంబంధించి ప్ర‌క‌టించే విష‌యంపై రాహుల్ తో చ‌ర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు ఉత్త‌మ్.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉత్త‌మ్ ను, కోశాధికారి గూడూరు నారాయ‌ణ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకున్నారు రాహుల్ . ఢిల్లీలోని వార్ రూంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్ద‌ల‌తో ఉత్త‌మ్ స‌మావేశ‌మవుతారు. ముందస్తు ఎన్నికల వార్తలు వస్తున్న నేపధ్యంలో పార్టీ లో కమిటీల ఏర్పాట్లు,అభ్యర్థుల ప్రకటనలు, పొత్తుల‌కు సంబంధించి అధిష్టానం దివానిర్దేశం చేయ‌నుంది.