కేసు పెట్టిన పవన్ హీరోయిన్


‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ప్రతీ జింగానియా గుర్తుందా.. ? ఇప్పుడీ హీరోయిన్ బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీతో పెట్టుకొంది. అమితాబ్ మనవడు, ఐశ్వర్య రాయ్ మేనల్లుడు పై కేసుపెట్టింది ప్రీతి. పర్వీన్‌ దబస్‌ ని పెళ్లాడిన ప్రీతి.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి
ముంబయిలోని బాంద్రాలో నివసిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు జైవీర్‌… బుధవారం సాయంత్రం జైవీర్‌ బాంద్రాకు కొద్ది దూరంలో ఉన్న మైదానంలో ఆడుకోవడానికి వెళ్లాడు. అదే మైదానానికి ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్‌ మేనల్లుడు కూడా వెళ్లాడు. ఈ నేపథ్యంలో పిల్లల ఫుట్‌బాట్‌ ఆడుతుండగా వారి మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో ఓ బాలుడు జైవీర్‌ కడుపులో కొట్టాడు. జైవీర్‌ ఆ బాలుడిని స్టుపిడ్‌ అని తిట్టాడు.

ఈ విషయాన్ని సదరు బాలుడు తన తాతయ్య సిద్ధిఖితో చెప్పాడు. సిద్ధిఖి మైదానంలోకి వచ్చి జైవీర్‌ను ఇతర పిల్లలను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతేకాదు.. జైవీర్‌ను మైదానం నుంచి గెంటేయాల్సిందిగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. ఈ విషయాన్ని జైవీర్‌ తన తల్లి ప్రీతితో చెప్పాడు. ఇప్పుడీ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ప్రీతి తన భర్తతో కలిసి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు తన కుమారుడిని కడుపులో కొట్టడం వల్ల సరిగ్గా తినలేకపోతున్నాడని, పాఠశాలకు కూడా వెళ్లలేకపోతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.