మహేష్’పై క్రిమినల్ కేసు

మహేష్ కత్తిపై క్రిమినల్ కేసు నమోదైంది. రాముడు, రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహేష్ ని హైదరాబాద్ పోలీసులు ఆర్నేళ్ల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ కత్తి ఏపీ నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ కొన్నాళ్ల పాటు ఉన్నారు. ఇటీవలే తిరిగి ఆంధ్రప్రదేష్ కు చేరుకొన్నారు. ఇకపై విజయవాడలోనే ఉండబోతున్నట్టు మీడియాకు తెలిపారు. ఐతే, ఇప్పుడు ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి న్యాయనిపుణులతో కలసి హైదరాబాద్ లో కత్తి మహేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పొలిటికల్ ఎంట్రీ ఇద్దామకొన్న మహేష్ ఆశలపై నగర బహిష్కరణ నీళ్లు చల్లింది. ఇప్పుడు క్రిమినల్ కేసు ఆయనకు మరింత ఇబ్బంది కలిగించేదే అని చెప్పవచ్చు.