మళ్లీ కాంగ్రెస్’లో చేరడంపై దానం మాట

టీఆర్ఎస్’లో టికెట్ దక్కని ఆశావాహులు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేష్ రాథోడ్, కొండా దంపతులు గులాభి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడీ లిస్టులో దానం నాగేందర్ చేరబోతున్నాడు. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇప్పటికే ఓ హోటల్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపాడని ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ఈ ప్రచారంపై దానం స్పందించారు. ‘తాను ఉత్తమ్ ని కలిసినట్టు వస్తున్న వార్తలు ఉత్తుతివే. తాను ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసినందువల్ల ఆ పదవిపై ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదు. తాను తెరాసలో బేషరతుగానే చేరా. ఎలాంటి పదవులు ఆశించడం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాస ఘనవిజయం సాధించి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా పదవి చేట్టడం ఖాయమన్నారు’.