బంద్ సాక్షిగా.. జగన్ దొరికిపోయాడు.. !

భారత్ బంద్ సాక్షిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాలు భారత్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు దేశంలోని 21 పార్టీలు మద్దతు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క వైసీపీ మాత్రం బంద్ కు దూరంగా ఉంది. దీంతో.. వైసీపీ బీజేపీతో కుమ్మక్కు అయిందంటూ ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయ్యింది. పెట్రో ధరల పెంపుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి దానిపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్ లో వైసీపీ పాల్గొనకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇది ఆ పార్టీకి బీజేపీపై ఉన్న ప్రేమని తెలియజేస్తోందని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. మరీ.. ఈ విషయాన్ని జగన్ ఎలా సమర్థించుకుంటాడో చూడాలి.