మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.

జ‌గిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు ఘాట్ రోడ్డు వ‌ద్ద‌జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వ‌ర్ మంత్రి ఈటెల హుటాహుటిన సంఘ‌టానా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ ప్రమాదం వ‌ర్ణించ‌డానికి వీలులేనంత విషాద సంఘ‌ట‌న అని, మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు మంత్రి కేటీఆర్. మృతుల కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు కేసీఆర్.