రేపే థియేటర్స్ లో రోబో ‘2.O’ !

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోబో ‘2.ఓ’ రిలీజ్ డేటు ఫిక్స్ చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ యేడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలైట్టింది. వినాయక చవితి కానుకగా రేపు (సెప్టెంబర్ 13న) టీజర్ వదలనున్నారు. ఐతే, ఈ టీజర్ థియేటర్స్ లోనూ సందడి చేయబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు శంకర్ ట్విట్ చేశారు. PVR & Sathyam థియేటర్స్ లో ‘2.ఓ’ టీజర్ ని చూడొచ్చు. ఇందుకోసం +91 9099949466 నెంబర్ కి ఫోన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాదు.. టీజర్ ని త్రీడీ ఫార్మెట్ లో చూపించబోతున్నారు.

దాదాపు 543 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాలో 3డీ పాట అదిరిపోనుందట. క్లైమాక్స్ సీన్ దిమ్మతిరిగిపోయేలా ఉందని చెబుతున్నారు. రోబో అంతకుమించి విజువల్ ఎఫెక్ట్స్ 2.ఓ లో చూపించబోతున్నారు. ఆలస్యమైనా, బడ్జెట్ పెరిగిపోతున్నా.. క్వాలిటీ విషయంలో దర్శకుడు శంకర్ కాంప్రమైజ్ కాలేదట. ఈ విషయాన్ని ఇటీవలే సంగీత దర్శకుడు రెహమాన్ చెప్పిన సంగతి తెలిసిందే. రేపు టీజర్ తో 2.ఓ రేంజ్ ఏంటో తెలిసిపోనుంది.