ఏపీలో ముందస్తుపై లోకేష్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ముందస్తు రాబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ముందస్తుపై వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమని ఆయన కొట్టి పారేశారు. ప్రస్తుతం ఎన్నికలపై ఆలోచన లేదు. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు లోకేష్. అదే సమయంలో తెలంగాణ ముందస్తు ఎన్నికలపై లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు నడవకపోవడం దురదృష్టకరం అన్నారు.