‘యు టర్న్’ పబ్లిక్ టాక్


సమంత ఇష్టపడి మరీ చేసిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యూ టర్న్’కు రిమేక్ ఇది. తెలుగు రిమేక్ కు మాతృక దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. సమంత చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ‘యు టర్న్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. మరీ.. ఈ సినిమా పబ్లిక్ టాక్ ఏంటో తెలుసుకొందాం పదండీ.. !

రచన (సమంత) రిపోర్టర్. సినిమాలో ఆమె తల్లితో కలిసి చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ రవింద్రన్ సమంత సహోద్యోగిగా కనిపించారు. రహదారి నియమాలను ఉల్లంఘించిన వ్యక్తిపై దాడి జరగడంతో.. ఆ వ్యక్తి వివరాలని సమంత సేకరించడంతో సినిమా ఆసక్తిగా మొదలైంది. ఈ చిన్ని పాయింట్ తో కథని మొదలెట్టిన దర్శకుడు.. సస్పెన్స్ తో కూడిన ఆసక్తికరమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ ని థ్రిల్లింగ్ సాగించారు.

ఈ కేసుని ఆది తన సొంత దర్యాప్తుగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడంతో రెండో భాగం మొదలైంది. ఫ్లైఓవర్ పై ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులను సమంత ఇంటర్వ్యూ చేయడం, భూమిక ఎంట్రీతో కథ మరింత రసవత్తంగా మారింది. చివరకు కర్మ భావనను అనుసంధానించడం మరియు వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేయడం అనే విషయంతో సినిమాని ముంచేశారు. సినినిమా అదిరిపోయింది. అసలు సమంత ఎందుకు ‘యు టర్న్’పై అంతలా ఇష్టం పెంచుకొంది అనేది సినిమా చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ కు ఓ లేడీ సూపర్ స్టార్ దొరికేసింది. అది సమంత. ఆమె నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావొచ్చు.