షాక్ : కోడలుతో నాగ్ రొమాన్స్ !

కోడలుతో నాగార్జున రొమాన్స్ కి దిగడం హాట్ టాపిక్ గా మారింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’లో నాగ చైతన్యకు జంటగా నటించింది అను ఇమ్మాన్యూయేల్. వినాయక చవితికానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇందులో చైతూ-అను జంటకి మంచి మార్కులు పడ్డాయి.

చైతూతో రొమాన్స్ చేసిన అను ఇప్పుడు నాగ్ సినిమాలో హీరోయిన్ ఎంపికవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకుడిగా మారి తీసిన చిత్రం ‘పవర్ పాండి’. మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా తన రెండో సినిమాగా ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఇందులో మరో హీరోగా నాగ్ ని తీసుకొన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఇప్పటికే అతిది రావుని తీసుకొన్నారు. తాజాగా, మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యూయేల్ ని తీసుకొన్నట్టు తెలిసింది. వీరిద్దరిలో ఎవరు నాగ్ కు జంటగా నటిస్తారన్నది స్పష్టత లేదు. దీంతో నాగ్ కోడలుతో రొమాన్స్ కి దిగబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. బహుశా.. నాగ్ సరసన అదితి జతకట్టే ఛాన్స్ ఉంది.